Modi: ముంబై మెట్రోలో మోదీ!

ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్‌ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు.

metro
New Update

 

మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్‌ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

మెట్రో కనెక్ట్‌ 3 యాప్ ను కూడా మోదీ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, సీఎం ఏక్‌ నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ లు ప్రధాని వెంట ఉన్నారు. బీకేసీ-ఆరే మధ్య మొత్తం పది వరకు మెట్రో స్టేషన్లు ఉంటాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం , సహర్‌ రోడ్‌ తో పాటు మరి కొన్ని ప్రాంతాలను ఈ మార్గం కలుపుతుంది.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe