Chhattisgarh: నకిలీ ఎస్బీఐ బ్రాంచ్..లక్షల మోసం

ఇంతకంటే మోసం మరొకటి ఉండదు. బ్యాంకులంటేనే భరోసా...అలాంటి బ్యాంకులే నకిలీవి అయితే...ఇంకేం చేయాలి. ఛత్తీస్‌ఘడ్‌లో ఎస్బీఐ  కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసి...గ్రామస్థుల చేత ఖాతాలు తెరిపించి డబ్బులతో ఉడాయించారు .

author-image
By Manogna alamuru
New Update

Fake SBI: 

ఛత్తీస్‌గఢ్‌లో విస్తుపోయే బ్యాంకింగ్‌ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ బ్రాంచ్‌లో.. అచ్చం అసలైన బ్యాంక్‌ లాగానే కొత్త ఫర్నీచర్‌, బ్యాంక్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నకిలీ శాఖ అని తెలియక గ్రామస్థులు ఇందులో ఖాతాలు తెరచి అడ్డంగా మోసపోయారు.

ఎస్బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌కు విషయం తెలిసి, గత నెల 27న ఈ బ్రాంచ్‌పై విచారణ చేయడంతో అసలు మోసం బయటపడింది. ఈ బ్రాంచ్‌లో ఉద్యోగం పొందినవారికి ఇచ్చిన ఆఫర్‌ లెటర్లు కూడా అచ్చం నిజమైన వాటిలాగే ఉన్నాయి. ఈ నకిలీ శాఖలో ఉద్యోగాలను రూ.2 నుంచి రూ.6 లక్షల ధరకు అమ్మినట్టు బాధితులు వాపోయారు.

 

Also Read: హర్యానా,జమ్మూ–కాశ్మీర్‌‌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు