అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం తర్వాత ఎయిర్లైన్స్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ కాంప్బెల్ విల్సన్ తొలిసారి స్పందించారు. విమానం టేకాఫ్కు ముందు ఎటువంటి సమస్యలు కనిపించలేదని తెలిపారు. జూన్ 2023లో దాని చివరగా తనిఖీ చేశామని, తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 2025కు ఫిక్స్ చేశామన్నారు. విమానం కుడి ఇంజిన్ను మార్చి 2025లో మరమ్మతులు చేశామని, ఎడమ ఇంజిన్ను ఏప్రిల్ 2025లో తనిఖీ చేసినట్లుగా వెల్లడించారు. విమానం, ఇంజిన్లు రెండింటినీ క్రమం తప్పకుండా పర్యవేక్షించామని, విమానం టెకాఫ్ కు ముందు తమకు ఎటువంటి సమస్యలు కనిపించలేదని విల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విమానానికి అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్ నాయకత్వం వహించారని ఆయన తెలిపారు.
#AirIndiaPlaneCrash | Air India CEO Campbell Wilson says, "We want to share some important facts about Flight A1171 to provide clarity during this difficult time. The plane was well-maintained, with its last major check in June 2023 and the next scheduled for December 2025. Its… pic.twitter.com/4KzkcHXcwV
— ANI (@ANI) June 19, 2025
10,000 గంటలకు పైగా
పైలట్, ట్రైనర్ కు 10,000 గంటలకు పైగా వైడ్బాడీ విమానాలను నడిపిన అనుభవం ఉందన్నారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు 3,400 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు. ప్రయాణానికి ముందు బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలను చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రయాణికుల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ విషాదం పట్ల విల్సన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు 34 మంది చనిపోవడం చాలా బాధకరమని తెలిపారు. సంఘటన జరిగిన దానిని అర్థం చేసుకోవడానికి ఎయిర్లైన్ అధికారులతో పూర్తిగా చర్చలు జరుపుతున్నామని అన్నారు.