/rtv/media/media_files/2025/11/11/nithish-2025-11-11-10-33-05.jpg)
బిహార్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకపక్కా చలి చంపేస్తున్న ఓటర్లు ఉత్సహంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూతుల వైపు బారులు తీరుతున్నారు. 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే, గయ జిల్లా అత్యధికంగా 15.97% ఓటింగ్తో అగ్రస్థానంలో ఉండగా, మధుబని జిల్లా అత్యల్పంగా 13.25% ఓటింగ్తో ఉంది.
14.55% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/AVpqkM6GZk
— ANI (@ANI) November 11, 2025
12 మంది మంత్రుల భవితవ్యం
ఈ రెండో దశలోనే నితీష్ కుమార్ మంత్రివర్గంలోని డజనుకు పైగా మంత్రులతో సహా పలువురు ముఖ్య నాయకుల భవితవ్యం తేలనుంది. మొదటి దశ పోలింగ్లో చారిత్రాత్మకంగా 64.66% ఓటింగ్ నమోదు కావడంతో, ఈ రెండో దశ ఓటింగ్ శాతంపై కూడా అందరి దృష్టి ఉంది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నేపాల్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి సరిహద్దులను మూసివేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
Follow Us