Madhya Pradesh: బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాన్ అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Madhya Pradesh
New Update

Army Jawan Raped Bank Officer Wife: ఎన్ని జరిగినా..ఎంత పోరాటాలు చేసినా మహిళల మీద ఆకృత్యాలు మాత్రం తగ్గడం లేదు. చదువుకోని వాడి దగ్గర నుంచి బాగా చదువుకున్న మేధావుల వరకూ అందరూ ఆడదాన్ని ఆటబొమ్మల్లాగే ట్రీట్ చేస్తున్నారు. చివరకు దేశాన్ని రక్షించే సైనికులు సైతం మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇండోర్‌‌లో అత్యంత విషాదకర సంఘటన వెలుగు చూసింది. బ్యాంకు ఉద్యోగి భార్యను ఆర్మీ జవాను రేప్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్‌ని చొప్పించాడు. అమె నరకం అనుభవించేలా చేశాడు. అయితే అదృష్టవశాత్తు బాధిత మహిళ ప్రాణాలతో బయటపడింది. కానీ విపరీతమైన బాధు మాత్రం అనుభవించింది. ఆ బాధతోనే అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేశారు. 

నిందితుడి పేరు సంజయ్ యాదవ్. తనను కలవాలంటూ మహిళను ఓ హోటల్‌కు పిలిచాడు. తర్వా అక్కడే మహిళపై అత్యాచారం చేశాడు. దాని తరువాత క్రూరంగా బిహేవ్ చేశాడు.  బాధిత మహిళ, నిందితుడు ఏడాది క్రితం మోవ్ ఆర్మీ క్యాంటీన్‌లో కలుసుకున్నారని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కౌశల్య చౌహాన్ తెలిపారు. ఇద్దరికీ ఇంతకు ముందు నుంచే పరిచయం ఉంది. నిన్న నిందితుడు బాధితురాలిని కలిసేందుకు ఇండోర్‌కు వచ్చాడు. నిందితుడు మహిళను బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బు కూడా తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం.. బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. ప్రస్తుతం అతను అస్సాంలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు.

#crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe