మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువునష్టం దావా కేసులో గుజరాత్ సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు ఇంతకు ముందు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రాహుల్గాంధీ రివిజన్ పిటిషన్ వేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్పై వాదనలు విననుంది. అంతకుముందు జస్టిస్ గవాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువైపుల నుంచి తనకు కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నాయని, తన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినా.. ఆ పార్టీతో అనుబంధం ఉందంటూ తీవ్రస్ధాయిలో వ్యాఖ్యానించారు. తన సోదరుడు కాంగ్రెస్లోనే ఉన్న విషయం గుర్తు చేయగా.. అందుకు రాహుల్ తరపు న్యాయవాది సింఘ్వీ నుంచి, మరో తరపు న్యాయవాది మహేష్ జెఠల్మానీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. దీంతో ఆగష్టు 4వ తేదీన గుజరాత్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం బెంచ్ వాదనలు విననుంది.
పూర్తిగా చదవండి..రాహుల్గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కీలక ఆదేశాలు..
ప్రధాని మోదీ ఇంటిపేరు కేసులో రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోరుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్ ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి, మరికొందరు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీ పిటిషన్పై ఆగష్టు 4వ తేదీన వాదనలు వింటామని కోర్టు బెంచ్ తెలిపింది.
Translate this News: