దేశంలో టమాట ధర పెరుగుదల సామాన్యులపై చాలా ప్రభావం చూపుతోంది. దొంగతనాలు చేసినప్పుడు దొంగలు బంగారం, డబ్బుతో పాటు నాలుగు టమాటలు కూడా తీసుకెళ్తే మనకు ఖర్చు తగ్గుతుంది కదా అని దొంగలు కూడా ఆలోచిస్తున్నారంటే.. టమాటలకు ప్రస్తుతం ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా పది, ఇరవై రుపాయలకు కిలో ఉన్న టమాట ఇప్పుడు రూ.120 నుంచి రూ.250 పలుకుతోంది. ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు హడలెత్తి పోతున్నారు. అయితే సమాజంలో ఏది జరిగినా.. దాన్ని ఫన్గా తీసుకుని మీమ్స్, రీల్స్, షాట్స్ చేయడం సోషల్ మీడియా యూజర్స్కు బాగా అలవాటైపోయింది. ఇక ఈ టమాట ధరల పెరుగుదలతో జరుగుతున్న వివిధ రకాల సంఘటనలను చూసి వీళ్లు ఊరుకుంటారా..? అందుకే టమాట ధరల పెరుగుదలపై రకరకాల రీల్స్, షాట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..టమాట ధరల పెరుగుదలపై దుమ్ములేపుతున్న క్రేజీ రీల్స్..!
ప్రస్తుతం సోషల్మీడియాలో ఎక్కడ చూసిన టాపిక్ టమాట ధరల ట్రెండింగ్ నడుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ధరల సంగతి పక్కన పెడితే.. ఈ టమాట పెరుగుదలపై మాత్రం రోజుకో క్రేజీ స్టోరీలు జరుగుతున్నాయి. ఒకరేమో టమాటలు కాపాడుకోవడానికి బౌన్సర్లు పెట్టుకుంటే.. మరొకరు కూరలో రెండు టమాటాలు వేశాడని భర్తను వదిలేసింది ఓ భార్య. ఇక ఓ రైతు ఒక్కరోజులో టమాటలు అమ్మి రూ.36 లక్షలు సంపాదించాడు. ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు టమాటపై కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
Translate this News: