Indian Navy : దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్!

సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థానీయులను భారత నావికాదళం అధికారులు రక్షించారు. సోమాలియా సముద్రపు దొంగలపై భారత నౌకాదళం చర్య కొనసాగుతోంది. భారత నావికాదళం 24 గంటల్లో రెండోసారి అల్ నమీ అనే ఫిషింగ్ నౌకను రక్షించింది.

Indian Navy : దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్!
New Update

Indian Navy Save To Pakistan : 24 గంటల్లో భారత నావికాదళం(Indian Navy) మరో విజయవంతమైన ఆపరేషన్‌ చేసింది. సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థానీయులను రక్షించారు. సోమాలియా(Somalia) సముద్రపు దొంగలపై భారత నౌకాదళం చర్య కొనసాగుతోంది. భారత నావికాదళం 24 గంటల్లో రెండోసారి అల్ నమీ అనే ఫిషింగ్ నౌకను రక్షించింది.

పైరేట్స్‌ పై ఐఎన్‌ఎస్‌ సుమిత్ర మరో ఆపరేషన్‌:

కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన అల్ నమీ అనే ఫిషింగ్ ఓడ(Al Neami Fishing Boat) ను నౌకాదళ యుద్ధనౌక సుమిత్ర(INS Sumitra) రక్షించిందని భారత రక్షణ అధికారి సమాచారం ఇచ్చారు.



ఫిషింగ్ ఓడలో 19 మంది పాకిస్థానీలు

సోమాలియా తూర్పు తీరంలో నేవల్ షిప్ సుమిత్ర మరో విజయవంతమైన యాంటీ పైరసీ ఆపరేషన్‌ను నిర్వహించిందని భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళం 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుండి ఫిషింగ్ ఓడ అల్ నమీ, దాని సిబ్బందిని రక్షించింది. ఈ నౌకలో 19 మంది పాకిస్థానీ పౌరులు కూడా ఉన్నారు.

ఒకరోజు ముందు ఇరాన్ నౌక:

ఒక రోజు ముందు కూడా భారత నావికాదళం విజయవంతమైన ఆపరేషన్ చేసిందని తెలిసిందే. సోమాలియా సముద్రపు దొంగలు కిడ్నాప్‌కు గురైన మత్స్యకారులను భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సుమిత్ర రక్షించింది. దాదాపు 17 మంది సిబ్బంది ఉన్న ఇరాన్ నౌకను పైరేట్స్ హైజాక్ చేశారు.

Also read: రాజోలులో రాజుకుంటున్న టికెట్‌ రగడ.. టీడీపీలో మొదలైన అసంతృప్తి!

#al-neami-fishing-boat #ins-sumitra #indian-navy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe