హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన మరికొన్ని ప్రాంతాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నార్త్ రైల్వేస్ పరిధిలోని 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు చోట్ల ట్రాకులపై భారీగా వరద నీరు చేరడంతో ట్రైన్ల రాకపోకలను నిలిపివేశామని రైల్వే అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలతో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు, ఇండ్లు నీట మునిగాయి. రాష్ట్రమంతటా దాదాపుగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.పెద్ద నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గడిచిన 36 గంటల్లోనే 14 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, 13 చోట్ల ఆకస్మిక వరదలు వచ్చాయని, 700 రోడ్లు బంద్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మనాలిలో షాపులు, వెహికల్స్ వరద నీటిలో కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని వికాస్నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్వేస్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
పూర్తిగా చదవండి..ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, బీభత్సం సృష్టించిన వరదలు
కుండపోత వర్షాలతో ఉత్తర భారత్ జనాలు వణికిపోతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్స్, చెట్లు విరిగిపడి ఇప్పటివరకు 28 మంది మృతి చెందారని అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే గత 40 ఏండ్లలోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. యమునా నది రెండు రోజుల్లో డేంజర్ మార్క్ ను దాటనుందని అధికారులు హెచ్చరించారు.
Translate this News: