AP: నాయకుడు - ప్రతినాయకుడు.. నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్..!

ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయకుడు-ప్రతినాయకుడు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన అంటూ చంద్రబాబు ఢిల్లీ టూర్ ను ప్రస్తావించిన నారా లోకేశ్... ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటన అంటూ పిన్నెల్లిని జగన్ పరామర్శించడాన్ని ఎత్తిచూపారు.

New Update
AP: నాయకుడు - ప్రతినాయకుడు.. నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్..!

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయకుడు-ప్రతినాయకుడు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాలను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటన లను పోల్చుతూ ట్వీట్ చేశారు.

'నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన: అధికారులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చ.. ప్రధానిని కలిసి ఇవీ నిర్థిష్టంగా రాష్ట్ర తక్షణ అవసరాలు అని విన్నపం.

ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటన: అక్రమాలు, అరాచకాలలో ఆరితేరి, పల్నాడును రావణకాష్టం చేసి, చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ. ఎన్నికల ఫలితాల తరువాత మాజీ సిఎం పెట్టుకున్న తొలి పర్యటన నెల్లూరు జిల్లా జైలు.

ఏపీ సీఎం నెక్ట్స్ పర్యటన:- తెలంగాణ సీఎంతో భేటీ..విభజన చట్టంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రయత్నం. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం.

1+6+4 సీట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడి పర్యటన:- బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైలులో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పరామర్శ?' అంటూ ట్వీట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.

Advertisment
తాజా కథనాలు