Nandyal: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫారుఖ్కి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న పరూఖ్ వాహనం తమ్మరాజు పల్లె వద్ద గేదెలను ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు.
Also Read: నాలుగేళ్ల కొడుకును కొట్టి చంపిన కసాయి తండ్రి..!
ఈ ఘటనలో ఫారుఖ్ కారు ముందు భాగం నుజ్జు నుజ్జ అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాయపడిన ఫారుఖ్ ను నంద్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.