/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ganjayi-jpg.webp)
ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి దందాపై పోలీసులు (Telangana Police) ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 168 గంజాయి ప్యాకెట్లను (336 కేజీలు) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 84 లక్షల వరకు ఉంటుందని వివరించారు. నిందితుల వద్ద నుంచి ఒక డీసీఎం, మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు