Crime News: నాగర్ కర్నూల్‌లో నర హంతకుడు.. 20 మందిని చంపి..?

హైదరాబాద్‌లోని ఓ హత్యకేసుతో నాగర్ కర్నూల్‌లోని ఓ తాంత్రికుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పూజలతో అమాయకులకు ఎర వేశాడు సత్యం. గుప్త నిధుల కోసం ఓకే కుటుంబం లోని నలుగురిని హత్య చేశాడు. అంతేకాకుండా, ఏకంగా 20 మంది హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సమాచారం.

Crime News: నాగర్ కర్నూల్‌లో నర హంతకుడు.. 20 మందిని చంపి..?
New Update

Crime News: పక్క ఊరికి వెళ్లినంత ఈజీగా అంతరిక్షానికి వెళ్తున్న రోజులివి. చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్న టెక్నలజీ యుగమిది. ఐనా మూఢ నమ్మకాలు మాత్రం ఆగడం లేదు. మారుమూల ప్రాంతాలే కాదు.. ఉన్నత విద్యావంతులున్న పట్టణాలు, నగరాల్లోనూ అంధ విశ్వాసాలు అరాచకం సృష్టిస్తున్నాయి. కుద్రపూజల పేరిట మనుషులను చంపేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని ఓ హత్యకేసులో తీగ లాగితే డొంక కదిలింది.

Also Read: అయ్యో.. హెడ్‌ఫోన్స్‌ ఆర్డర్‌ చేస్తే.. టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది..

నాగర్ కర్నూల్‌ జిల్లాలో తాంత్రికుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పూజలతో అమాయకులకు ఎర వేశాడు సత్యం అనే వ్యక్తి. మాయమాటలు చెప్పి మనుషుల అవసరాలను కాష్ చేసుకునేవాడు. తాంత్రిక పూజలు చేసి మంచి జరుగుతుందని నమ్మించి అతి దారుణంగా హత్య చేసేవాడు. 2020లో గుప్త నిధుల కోసం ఏకంగా ఓకే కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేశాడు నర హంతకుడు.



Also Read: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మంది హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు సత్యం. హైదరాబాద్, నాగర్ కర్నూల్‌, ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో తాంత్రికుడిపై హత్య కేసులు నమోదైయ్యాయి. తాజాగా, హైదరాబాద్ లోని ఓ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా  తాంత్రికుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసం చేశాడు? ఎంతమందిని చంపాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

#telangana #mahaboobnagar-crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe