కొత్త సినిమా కోసం బోటులో సముద్రంలోకి నాగచైతన్య!

New Update
కొత్త సినిమా కోసం బోటులో సముద్రంలోకి నాగచైతన్య!

నాగచైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నాడు.

ఈ రోజు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి వైజాగ్ పోర్టును సందర్శించాడు చైతూ. ఈ సందర్భంగా మత్స్యకారులతో కలసి బోటులో సముద్రంలోకి వెళ్లాడు. సముద్రంలో చేపల వేట, ప్రయాణం, అక్కడ ఎదురయ్యే గడ్డు పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు.

నాగచైతన్య చేస్తున్నగ్రౌండ్ వర్క్ నిజంగా స్ఫూర్తిదాయకం. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఇలా స్థానికులని కలిసి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని సహజత్వం ఉట్టిపడే చిత్రాలని అందించాలానే ప్రయత్నం అభినందనీయం.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు చందూ మొండేటి దర్శకుడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకొచ్చి, టైటిల్ కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నాడు. ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు