TDP- JSP: గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలనివ్వను అని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తిగత స్వలాభం కోసమో కాదని వ్యాఖ్యనించారు. కేవలం రాష్ట్రం అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతులు, మహిళల కోసమేనని అన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు.. వైసిపి తప్ప వేరే ఏ పార్టీ ఉండకూడదని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం, పార్టీ శ్రేణులు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!
ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అంటున్నది ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తిగత స్వలాభం కోసమో కాదని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, రైతులు, మహిళల కోసమేనని అన్నారు జనసేన పీఏసీ నాదెండ్ల మనోహర్.
Translate this News: