మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishna Reddy) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చలమల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయన టికెట్ కు బ్రేక్ పడింది. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫామ్ కావడంతో చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి మరో చోట పోటీ చేసి.. మునుగోడు తనకు వదిలి పెట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఎం కటీఫ్.. కారణమిదే?
TS Politics 2023: మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి షాక్.. బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి
ఇటీవల బీజేపీ నుంచి సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మునుగోడు కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Translate this News: