MP Raghu Rama: నాపై ఇలా కుట్రలు చేస్తున్నారు: ఎంపీ రఘురామ

నన్ను నా నియోజకవర్గం నుంచి పర్మినెంట్ గా దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. భీమవరంలో కూటమి పార్టీలు ఏర్పాటు చేసిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని నేతలకు కీలక విషయాలు వెల్లడించారు.

MP Raghu Rama: నాపై ఇలా కుట్రలు చేస్తున్నారు: ఎంపీ రఘురామ
New Update

MP Raghu Rama: తనను తన నియోజకవర్గం నుంచి పర్మినెంట్ గా దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. భీమవరంలో కూటమి పార్టీలు ఏర్పాటు చేసిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి పార్టీలలో ఎందుకు సభ్యత్వం లేదో, ఎందుకు తీసుకోలేదో కూటమి పార్టీ నాయకులకు తెలుసన్నారు.

Also Read: పొత్తుల పార్టీల్లో అసమ్మతి.. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం..!

తాను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆ మరుక్షణం తన ఎంపీ సీటు పోతుందని, అప్పుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడి పోరాడేది ఎవరన్నారు రఘురామ. తనకు తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తనను ప్రేమించే వారు ఉన్నారని, రాజకీయాల్లో ఎప్పుడూ ఏదైనా జరగవచ్చని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.

#mp-raghu-ramakrishna-raju
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe