/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-3-6-jpg.webp)
MP kesineni Chinni: విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని వెల్లడించారు. రాజధాని అవుటర్ రింగ్ రోడ్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అలాగే యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్ కు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వీటన్నింటిపై తగిన ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పారని కేశినేని చిన్ని తెలిపారు.