Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక 

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటి కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కార్తీ చిదంబరం లేఖలో కోరారు. 

New Update
Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక 

Bank Guarantees: ఇటీవల RTV వెలువరించిన కథనం నిజాలను నిగ్గు తేల్చేదిగా మారుతోంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు దొంగ బ్యాంక్ గ్యారెంటీలు సబ్మిట్ చేసినట్టు RTV వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్యారెంటీలు ఇచ్చిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీలను అంగీకరించిన విషయంలో ఎస్బీఐ వివరణ కావాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. ఈమేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఒక లేఖ రాసారు. ఈ లేఖలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలకు సంబంధించి 19/7/2023, 5/5/2022 తేదీలతో ఏవైనా లెటర్స్‌  SBI జారీ చేసిందా లేదా అనేది స్పష్టం చేయాలని కార్తీ చిదంబరం చెప్పారు.  యూరో ఎగ్జిమ్‌ బ్యాంకు గ్యారెంటీలను SBI అంగీకరించడంపై దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇవ్వాలని SBI ఛైర్మన్‌ను కార్తీ చిదంబరం కోరారు. 

యూరో ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటికి...సంబంధించిన కంపెనీలు గ్యారెంటీలు తీసుకున్నట్లు RTV  బయటపెట్టింది. RTV కథనాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. తరువాత ఈ విషయంపై రాజాకీయ నాయకులు స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంపీ కార్తీ చిదంబరం ఎస్బీఐని వివరణ కోరుతూ లెటర్ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

అసలేమిటి ఈ బ్యాంక్ గ్యారెంటీల కథ?

ఇండియాలో ప్రాజెక్టులకు పక్కదేశంలో ఉన్న బ్యాంక్  గ్యారంటీలు ఇవ్వడమేంటి? అది కూడా బ్యాంక్‌ కానీ బ్యాంక్‌.. దొంగ బ్యాంక్‌ గ్యారంటీలు ఇవ్వడమేంటి? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉన్న సెయింట్‌ లూసియా జనాభా 2 లక్షలు మాత్రమే. ఈ బ్యాంక్‌ నికర విలువ 8 కోట్లు మాత్రమే. ఇలాంటి డమ్మీ బ్యాంక్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారెంటీలు ఇచ్చింది. సెయింట్ లూసియాలో ఉండే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఓ చిన్న ఫినాన్షియల్‌ కంపెనీ ఇండియాలో లక్షల కోట్ల మోసాలకు కారణమవుతోంది. అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఆ కంపెనీ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఈ బ్యాంక్ గ్యారెంటీలతోనే తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేపట్టింది. 

ఏపీ విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్ధన్ రెడ్డి, ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి, ప్రతిమ శ్రీనివాసరావు కంపెనీలు కూడా ఉన్నాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించింది. అటు కర్ణాటక డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు స్వాగతం పలికాయి. మరోవైపు మహారాష్ట్రలో MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా కుంభకోణానికి లైన్ క్లీయర్ చేశాయి.

ఈ విషయాన్ని RTV బయటపెట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మొన్న బీజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి దీనిలో మంత్రి పొంగులేటి కూడా ఉన్నారని స్పష్టం చేశారు.  దీనిపై సీబీఐ విచారణ ఆయన డిమాండ్ చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఎంపీ కార్తీ చిదంబరం ఎస్బీఐ ఛైర్మన్ కు ఈ అంశంపై క్లారిటీ కావాలని కోరడం గమనార్హం. 

అసలు బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి?
బ్యాంక్ గ్యారంటీ అంటే కాంట్రాక్టరు షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10 శాతం మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు మేటర్‌ వేరే ఉంది. RBI గుర్తించిన బ్యాంకుల జాబితాలో కూడా లేని యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌ గ్యారంటీలను ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఈ దొంగ బ్యాంక్‌ హెడ్ ఆఫీసు సెయింట్ లూసియాలో ఉంది కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఇలా ఇండియాకు ఏ మాత్రం సంబంధం లేని ఓ చిన్న ఫినాన్షియల్ కంపెనీ భారత్‌లో లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్యారంటీ ఇస్తుండడం విడ్డూరం అనే చెప్పాలి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు