Crime News: బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డ సాయి మేఘన(18) ఫిట్స్ తో మృతి చెందింది. కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఉషారాణి సైతం గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారకరమైన ఘటన స్థానికులను కలచివేస్తోంది.

New Update
Crime News: బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి

Anakapalli: కుమార్తె మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారకరమైన ఘటన అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలంలో చోటుచేసుకుంది. తల్లి కూతురు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగి నిమ్మకాయల శ్రీనివాసరావు తన కుమార్తె సాయి మేఘన(18) , భార్య ఉషారాణి(51)తో కలిసి స్థానికంగా ఒక అపార్ట్ మెంట్ లో నివాసముంటున్నారు. సాయి మేఘన ఫిట్స్ వ్యాధితో కొంతకాలం నుంచి బాధపడుతుంది. ఈ క్రమంలోనే నేడు ఉదయం 7:30 గంటల సమయంలో ఉన్నటుండి కుమార్తె మేఘన ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు తండ్రి శ్రీనివాసరావు తెలిపారు.

Also Read: పాపం పవన్ కళ్యాణ్‌.. జనసేనకు ఎందుకు సీట్లు తగ్గించారు.. : అమర్‌నాథ్

కుమార్తె మృతదేహం వద్ద కూర్చొని ఆమె మరణ విషయం దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఫోన్లో తెలియజేస్తూ తల్లి ఉషారాణి సైతం అక్కడికక్కడే గుండెపోటుతో కొప్పకూలి మరణించినట్లు ఉషారాణి భర్త శ్రీనివాసరావు బోరున విలపిస్తూ తెలిపారు. ఈ హృదయ విదారకరమైన ఘటనను చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. భార్య ఉషారాణి, కుమార్తె అకాల మరణం చెందడంతో బాధితుడు శ్రీనివాసరావు బోరున విలపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు