Morarji Desai: పాకిస్థాన్ గౌరవం పొందిన ఆయనే మన దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు!

ఈనెల 23న ఏడోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. తన పుట్టినరోజున రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన సొంతం. 

Morarji Desai: పాకిస్థాన్ గౌరవం పొందిన ఆయనే మన దేశంలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు!
New Update

Morarji Desai: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనుంది. మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌ను, మధ్యంతర బడ్జెట్‌ను కలిపి ఆమె ఏడోసారి సమర్పించబోతున్నారు, ఇది స్వతహాగా ఒక రికార్డు అయితే ఇప్పటివరకు గరిష్టంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మరొకరి పేరు మీద ఉంది. ముందుగా నిర్మలా సీతారామన్ రికార్డ్ చూద్దాం. 

తిరుగులేని నిర్మలా సీతారామన్.. 

వరుసగా  ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ ది. మొరార్జీ దేశాయ్ ఆరు సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ రికార్డ్ బద్దలు కొట్టారు నిర్మలా సీతారామన్. అలాగే ఇన్నిసార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే. అన్నిటికన్నా అతి ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కూడా నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం చరిత్రకెక్కింది. 2022 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇది పెద్ద రికార్డు. ఇప్ప్పుడు దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారెవరో తెలుసుకుందాం..

అవును, దేశంలోనే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. అంతేకాదు తన పుట్టినరోజున రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన సొంతం. 

Morarji Desai: భారతదేశంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంట్‌లో కేంద్ర లేదా మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంవత్సరాల్లో మధ్యంతర బడ్జెట్, ఇతర సంవత్సరాల్లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బడ్జెట్ సెషన్‌లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.  ఇది ఆర్థిక సంవత్సరంలో ఆదాయ .. ఖర్చుల వివరాలను ఇచ్చే డాక్యుమెంట్ గా చెప్పవచ్చు.  భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది.

భారతదేశపు తొలి బడ్జెట్‌ ఎవరు ప్రవేశపెట్టారంటే..

Morarji Desai: నిజానికి, భారతదేశం మొదటి బడ్జెట్‌ను బ్రిటిష్ పాలనలో ఏప్రిల్ 7, 1860న బ్రిటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ సమర్పించారు. ఈస్టిండియా కంపెనీ ఖర్చుల ఎకౌంట్స్  సిద్ధం చేయడానికి.. భారతదేశంలో కొత్త పన్నులు విధించడానికి దీనిని ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశం మొదటి మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ప్రభుత్వం కోసం లియాఖత్ అలీ ఖాన్ సమర్పించారు.  తరువాత అయన పాకిస్తాన్ ప్రధాన మంత్రి అయ్యారు. స్వతంత్ర భారతదేశం మొదటి సాధారణ బడ్జెట్‌ను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. ఈ బడ్జెట్ 1947 నవంబర్ 16న సమర్పించారు.  మొరార్జీ దేశాయ్ 10 సార్లు పార్లమెంటులో ఆదాయ వ్యయాల లెక్కలను సమర్పించారు.

ఆ రికార్డ్ ఆయనదే!

Morarji Desai: అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని వల్సాద్‌లో జన్మించారు. 1958 మార్చి 13న దేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆయన 29 ఆగస్టు 1963 వరకు ఈ పదవిలో కొనసాగారు. దీని తరువాత, మార్చి 1967 లో, ఆయనకు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈసారి జూలై 1969 వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ఈ పదవీకాలంలో ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు.

పుట్టినరోజు నాడే రెండు సార్లు బడ్జెట్..

Morarji Desai: ఫిబ్రవరి 29న జన్మించిన మొరార్జీ దేశాయ్ పుట్టినరోజు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. అప్పట్లో  బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి తేదీన సమర్పించేవారు.  ఇటీవల ఈ ట్రెండ్‌కు తెరపడింది. ఈ 29వ తేదీన 1964, 1968లో మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చిదంబరం రికార్డ్..

దీని తరువాత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను సమర్పించిన రికార్డును కలిగి ఉన్నారు. ఆర్థిక మంత్రిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఎనిమిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ తో ఆమె 7వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు. 

ప్రధాని పదవి.. పాకిస్థాన్ గౌరవం..

Morarji Desai: వల్సాద్‌లోని ఒక గ్రామంలో జన్మించిన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి పదవికి కూడా చేరుకున్నారు. 1977లో తొలిసారిగా దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పుడు అతని వయస్సు 81 సంవత్సరాలు. మొరార్జీ దేశాయ్ 24 మార్చి 1977న ప్రధానమంత్రి అయ్యారు .. 28 జూలై 1979 వరకు ఈ పదవిలో కొనసాగారు. అతను భారతదేశం అత్యున్నత గౌరవం భారతరత్నతో పాటు పాకిస్తాన్ అత్యున్నత గౌరవం నిషాన్-ఎ-పాకిస్తాన్‌ను అందుకున్నాడు.

#union-budget-2024 #morarji-desai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe