పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలో సభ ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమైన తర్వాత ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు కూడా వ్యూహం రచించాయి.
పూర్తిగా చదవండి..Parliament : పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం..!!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ అయ్యాయి. సమావేశాలు ప్రారంభం అవ్వగా...అప్ నేత సుశీల్ కుమార్ రింకు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరంఈమధ్యే మరణించిన సభ్యుల మ్రుతికి లోకసభ సంతాపం తెలిపింది. అనంతరం లోకసభ స్పీకర్ ఓంబిర్లా...సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో జూన్ లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళలర్పించింది సభ. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కర్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు.
Translate this News: