భూమి వేడెక్కుతోంది..చరిత్ర ఎన్నడూ చూడని విధంగా మండిపోతోంది. యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు లెక్కించడం మొదలు పెట్టిన తర్వాత ఎన్నడూ రికార్డవని ఉష్షోగ్రతలు నమోదయ్యాయి. ముందుగా జులై 3న భూమి సగటు ఉష్ణోగ్రత రికార్డు సృష్టితే..ఆ రికార్డు జులై4న చెరిగిపోయింది. జులై 3న ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 17.01 డిగ్రీల సెల్సియస్ (62.6 డిగ్రీల ఫారన్హీట్)గా ఉండగా.. జులై 4న 17.18 డిగ్రీల సెల్సియస్గా (62.9 డిగ్రీల ఫారన్హీట్) నమోదైంది. అంటే అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు ఒక్క రోజులోనే బ్రేక్ అయ్యింది. గతంలో ఎప్పుడు కూడా భూమి సగటు ఉష్ణోగ్రత 17డిగ్రీల సెల్సియస్కు టచ్ అవ్వలేదు. అలాంటిది వరుసగా రెండు రోజులు ఆ మార్క్ను దాటడం పట్ల ఆందోళన కలగిస్తోంది.
పూర్తిగా చదవండి..Sun: భూమి మండుతోంది..చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. కారణాలేంటో తెలుసా..?
ఎన్నడూలేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులై 3న ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 17.01 డిగ్రీల సెల్సియస్గా ఉండగా.. జులై 4న 17.18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం.
Translate this News: