ఇవాళ వరంగల్ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు అంతా సిద్దమైంది. కాసేపట్ల మోడీ తెలంగాణకు విచ్చేయనున్నారు. ఉదయం 9.25గంటలకు హకీంపేట విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొంటారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న మోడీ..ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుంటారు.
పూర్తిగా చదవండి..నేడు తెలంగాణకు మోడీ..6,100కోట్ల విలువైన కానుక ఇవ్వనున్న ప్రధాని..!!
వరంగల్ లో ఈరోజు రూ.6100 కోట్ల విలువైన పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లకు పైగా రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ ఆధునిక తయారీ యూనిట్ అధునాతన వ్యాగన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది స్థానికంగా ఉపాధి కల్పనకు దోహదపడుతుంది.
Translate this News: