మోడీ ఇంటిపేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన రెండు సంవత్సరాల శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన స్టే పిటిషన్ను గుజరాత్ హైకోర్టు జూలై 7న కొట్టివేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గాంధీ పిటిషన్ను విచారించేందుకు జూలై 18న అంగీకరించింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసును త్వరగా విచారించాలని కోరారు.
పూర్తిగా చదవండి..Modi surname defamation case: రాహుల్ గాంధీ పిటిషన్పై నేడు సుప్రీం విచారణ.!!
మోడీ ఇంటిపేరు పరువు నష్టం కేసుకు సంబంధించి గుజరాత్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్,పికె మిశ్రాలతోకూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించే అవకాశం ఉంది.
Translate this News: