Telangana Elections 2023: హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్ నుంచి కాచిగూడ వరకు రెండు కి.మీ. మేర సాగిన ఈ రోడ్షోకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం వేలాదిగా కదలివచ్చారు. రోడ్ షొ ఆద్యంతం ఉత్సాహంగా అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందకు సాగారు.
కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. కాచిగూడ కూడలి వద్దకు చేరుకున్న మోదీ, అక్కడ సావర్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసేశారు. తెలంగాణలో మోదీ ప్రచారం ఈ రోడ్ షోతో ముగిసింది. మోదీ వెంట తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు.