Modi: హైదరాబాద్‎లో మోదీ రోడ్ షో: వేలాదిగా జనసందోహం

తెలంగాణలో తన ప్రచారంలో చివరిరోజైన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రోడ్ షో పొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

New Update
Modi: హైదరాబాద్‎లో మోదీ రోడ్ షో: వేలాదిగా జనసందోహం

Telangana Elections 2023: హైదరాబాద్‎లో ప్రధాని నరేంద్రమోదీ రోడ్ షో భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి కాచిగూడ వరకు రెండు కి.మీ. మేర సాగిన ఈ రోడ్‌షోకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం వేలాదిగా కదలివచ్చారు. రోడ్ షొ ఆద్యంతం ఉత్సాహంగా అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందకు సాగారు.

publive-image

కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. కాచిగూడ కూడలి వద్దకు చేరుకున్న మోదీ, అక్కడ సావర్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

publive-image

ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసేశారు. తెలంగాణలో మోదీ ప్రచారం ఈ రోడ్ షోతో ముగిసింది. మోదీ వెంట తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు