MLC Kalyani: విశాఖలో ఎమ్మార్వో హత్యకు కారణం ఇదే: ఎమ్మెల్సీ కళ్యాణి

విశాఖలో ఎమ్మార్వో హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందన్నారు ఎమ్మెల్సీ వరుదుల‌ కళ్యాణి. కుంటిసాకులతోనే అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

MLC Kalyani: విశాఖలో ఎమ్మార్వో హత్యకు కారణం ఇదే: ఎమ్మెల్సీ కళ్యాణి
New Update

MRO Ramanaiah Murder case : విశాఖలో MRO రమణయ్య  అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియన వ్యక్తులు రమణయ్య ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేశారు.  ఐరన్ రాడ్లతో కిరాతకంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read: పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క్లారిటీ..!

అయితే, ఎమ్మార్వో హత్య రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే MRO హత్యపై ఎమ్మెల్సీ వరుదల కళ్యాణి (MLC Kalyani) స్పందించారు. ఆయన హత్య వ్యక్తిగత కారణాలతోనే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే పలు విషయాలను చెప్పుకొచ్చారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో కావాలనే అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకెళ్తున్నారని విమర్శలు గుప్పించారు.



Also Read: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్.!

ప్రభుత్వంపై బురద చల్లేందుకు‌ టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLA) ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ జనసేన ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి అధికారం వస్తుందనుకోవడం వాళ్ల భ్రమేనని కామెంట్స్ చేశారు.

#mlc-varudula-kalyani #mro-ramanaiah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe