ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమావేశమైన తెలంగాణ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను శాసనమండలికి పంపేందుకు ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలకు చెందిన శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యానారాయణలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించే అవకాశమే లేదన్నారు. మరోవైపు గతంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన మూడు బిల్లులను కూడా ఆగస్టు 3 నుంచి నిర్వహిచబోయే అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ తీర్మానం చేసి పంపుతామని కేటీఆర్ వెల్లడించారు. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు.
పూర్తిగా చదవండి..గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపేందుకు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే గవర్నర్కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Translate this News: