MLC Kavitha: బిహార్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. జాతీయస్థాయిలో ఆ కూటమి నిలదొక్కుకునే అవకాశం లేదన్నారు కవిత. కాగా, బిహార్లో కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం నితీశ్కుమార్ రాజీనామా, తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర పరిణామాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బిహార్ రాజకీయ పరిణామాలపై ఆదివారం ఆమె స్పందించారు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీల బాధ్యత మరింతగా పెరిగిందన్నారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha: నేను ముందే చెప్పా.. ఇండియా కూటమిపై కవిత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. బిహార్ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్సీ
ఇండియా కూటమి మూణ్నాళ్ల ముచ్చటే అని తమకు తెలుసన్నారు ఎమ్మెల్సీ కవిత. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కూటమి ఉండబోదని ముందుగానే చెప్పామన్నారు. బిహార్ లో రాజకీయ పరిణామాలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: