/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ganesh-jpg.webp)
MLA Vasupalli Ganesh: విశాఖ ఒక్క బ్రాండ్ అందుకే సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధాని చేస్తాను అంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి ఆపుతున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఎంత మంది వచ్చినా సీఎం జగన్ ని ఎవరూ ఆపలేరని అన్నారు. పందులు గుంపులు గుంపులు గా వస్తాయి కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే సింగల్ గా సింహంలా వస్తారని కొనియాడారు. జనసేనకు ఒక్క సీటు రాదని అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని కామెంట్స్ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలి నాని కౌంటర్..!
భీమిలి నియోజకవర్గంలో భారీగా మూడు లక్షల జనాభాతో సిద్ధమైన సభ విజయవంతం అయితే దానిని విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో ప్రతిపక్షాలు పొల్యూషన్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలందరికి మేలు జరిగింది అందుకే ఓటు వేయండి అని ధైర్యంగా అడుగుతున్నమన్నారు. సీఎం జగన్ వై నాట్ 175 అన్నట్లుగా కచ్చితంగా 175 సీట్లు గెలుస్తాం అని జోశ్యం చెప్పారు.
Also Read: జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..!