MLA Seethakka : కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది వాళ్లే...సీతక్క సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ ఓడిపోతుందన్న విషయం తట్టుకోలేకే ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఓటమి అంచున బీఆర్ఎస్ ఉంది కాబట్టే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Seethakka : కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది వాళ్లే...సీతక్క సంచలన వ్యాఖ్యలు..!!
New Update

బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేక...కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. నాయకులను కొనుగోలు చేసే శక్తి నా దగ్గర ఉందా...ఇవన్నీ దొంగ మాటలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వచ్చే మాటలకు జవాబు లేక ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కష్టనష్టాలు ఎదురైనా..నిజమైన కార్యకర్తలు నాతో ఉంటున్నారని...బీఆర్ఎస్ నాయకులతో ఎందుకు ఉండటం లేదని సీతక్క ప్రశ్నించారు. ఓడిపోతున్నామని తెలిసే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ హత్యయత్నం చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఎవరు చేశారు..ఎవరు చేయించారన్న విషయాలను ముందు తెలుసుకోమని సూచించారు. సీతక్క సంచలన వ్యాఖ్యలను ఈ వీడియోలో పూర్తిగా చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల పార్టీ…ఆర్టీవీతో శ్యాం నాయక్ షాకింగ్ కామెంట్స్..!!

#mla-seethakka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe