AP: వైసీపీ మునిగిపోయే నావ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వైసీపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ప్పా.. ఎవ‌రూ మిగ‌ల‌ర‌ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు సెటైర్లు వేశారు. ఆ పార్టీ మునిగిపోయిన నావ అని అన్నారు. వైసీపీ నేతలు త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసి టీడీపీలో చేర‌తామంటే స్వాగ‌తిస్తామ‌న్నారు.

New Update
TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

MLA Ganta Srinivasa Rao: వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరుతుండడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఆ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతామంటే స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పడు చేరుతున్న వారు కూడా రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారన్నారు. వైసీపీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే వైసీపీలో జగన్ తప్పా ఇంకెవరు మిగిలేలా లేరన్నారు.

Also Read: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..!

ఇప్పటికే వైసీపీ ఎంపీ మోవిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, పార్టీలో ఎవరినిబడితే వారిని తీసుకోవద్దని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానానికి సూచించారు. అధికారం కోసం వారిని చేర్చుకుంటే.. పార్టీ అధికారం లేనప్పుడు కోసం కష్టపడి పనిచేసిన వారిని అవమానించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు