Adireddy Vasu: వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!

అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించామన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్నారు. తనను, తన కుటుంబసభ్యులను వైసీపీ వారు చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.

New Update
Adireddy Vasu: వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!

MLA Adireddy Vasu: రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన ఆదిరెడ్డి వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజా విజయం అన్నారు. అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించామన్నారు. తనను, తన సతీమణి భవానీ, తండ్రి అప్పారావును వైసీపీ వారు చాలా ఇబ్బంది పెట్టారని ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. అయితే, ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటామన్నారు. నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కార్యాచరణ కూడా చేపడతామన్నారు.

Also Read: జగన్ తోనే పోరాటానికి దిగిన నేను ఇలా చేయడం పెద్ద విషయం కాదు: కోటంరెడ్డి

Advertisment
తాజా కథనాలు