New Update
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ఆయనను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హరిబాబును నానక్ రామ్ గూడ లోని స్టార్ హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.