Hyderabad: హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా..

హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్ష్యం అయ్యాడు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లి తిరిగిరాలేదు. అర్ధరాత్రి తిరుపతి రైల్వేస్టేషన్‌లో బాలుడు కనిపించగా పోలీసులు విచారించి అదుపులోకి తీసుకున్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా..

Also Read: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందువుల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం!

ఎట్టకేలకు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా మిస్సయిన బాలుడి ఆచూకీ లభ్యం అయింది. హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్ష్యం అయ్యాడు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి ట్రైన్‌ ఎక్కి వెళ్లాడు ఆ బాలుడు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు  తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే, గత అర్ధరాత్రి తిరుపతి రైల్వేస్టేషన్‌లో బాలుడు ఒంటరిగా కూర్చొని కనిపించాడు. విచారించిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలుడి ఆచూకిపై మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు తల్లిదండ్రులతో కలిసి మీర్‌పేట పోలీసులు తిరుపతి బయలుదేరారు.

Advertisment
తాజా కథనాలు