తెలంగాణలో 4 వేల పెన్షన్ ఇస్తామంటున్న రాహుల్ ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ హయంలో జరిగినన్ని స్కాంలు ఎక్కడా జరగలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ టీం అనడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీం టీం కాదని కేసీఆర్ చెప్పారని మంత్రి వేముల అన్నారు. బీజేపీ నేత ఈటల, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రహస్య భేటీ నిజం కాదా? అని ప్రశ్నించారు.హోటల్ లో రహస్య భేటీ ఫోటోలు చూపించమంటారా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలిసిస్తే ఎవరు ఏవరికి బీ టీమో అర్థమవుతుందన్నారు.
పూర్తిగా చదవండి..బీఆర్ఎస్, బీజేపీ టీం అనడంతో రాహుల్పై బీఆర్ఎస్ నేతల ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మంలో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ జరుగుతుందో తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడారని అన్నారు. ఏ హోదాలో రాహుల్ పెన్షన్ల గురించి హామీ ఇచ్చారని. . కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ అమలవుతుందా? అని ప్రశ్నించారు.
Translate this News: