Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను ఈ వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేసీఆర్ సర్కార్ అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన
New Update

కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) జ్యూడీషియల్ విచారణను ఈ వారంలోనే మొదలు పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం లోన్స్ ఇప్పించిందన్నారు. కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. బీజేపీ-బీఆర్ఎస్ పదేళ్ల పాటు కలిసి పనిచేశాయని ఆరోపించారు ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాకముందే తమపై ఈ పార్టీల నేతలు బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై చర్చ?

పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి కేంద్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చిందన్నారు. రూ.1.27 లక్షల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చిందన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకే రూ.60 వేల కోట్ల రుణం బీజేపీ ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్- బీజేపీ కలిసి దోచుకుందాం అని.. లక్షల కోట్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ 5 ఫీట్లు కుంగితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కనీసం పరిశీలన చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితే ఎందుకు ఆయన పరిశీలించలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిప్పులు చెరిగారు.

ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టమని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రూ.80 వేల కోట్ల ప్రాజెక్ట్ అంచనాలను రూ.1.27 లక్షల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వేయలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోదీ, నడ్డా మరి ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు?. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసిందని.. మరి సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నలు గుప్పించారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుందన్నారు. ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ 3500 రోజులు కలిసి పని చేశాయన్నారు. ఇరిగేషన్ లో బీజేపీ-బీఆర్ఎస్ కలిసి అవినీతి చేశాయన్నారు ఉత్తమ్.

#kaleshwaram-poject #mp-uttam-kumar-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe