Minster singi reddy: ప్రజలకోసం..ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్న మంత్రి!

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ చేయూతనందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

New Update
Minster singi reddy: ప్రజలకోసం..ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్న మంత్రి!

Minster singi reddy: సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కార్ చేయూతనందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం, ప్రగతి కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామ, గ్రామాన అభివృద్ధి... గడప గడపకూ సంక్షేమ పథకాలు చేరేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన సమక్షంలో 55 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ , రైతుబీమా, రైతుబంధు పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు  చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

మంత్రి సమక్షంలో కురమ సంఘంవాసులు 55 మంది బీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. కాగా, ఏదులలో రైతన్నల సంబరాలు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు