ఐదేళ్ల క్రితం కూడా మహాకూటమి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఇంతే హడావుడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో మరో సారి గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. వందల మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియా గాంధీని ఆనాడు రేవంత్ రెడ్డి బలిదేవత అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అత్యధిక ఉద్యోగాలను ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) వద్ద 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన వారంతా నిరుద్యోగులు కాదన్నారు. ఉద్యోగాలను సృష్టించడంలో బెంగళూరును దాటేశామన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?
KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్
రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Translate this News: