Gajendra Shekavath: గుడ్లు, నాలుక పీకేస్తాం..జాగ్రత్తగా మాట్లాడండి: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌!

'' మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Gajendra Shekavath: గుడ్లు, నాలుక పీకేస్తాం..జాగ్రత్తగా మాట్లాడండి: కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌!
New Update

తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ (Udayanidhi stalin)  సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయానికి సంబంధించి నిత్యం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ నేతలు ఉదయ నిధి పై కేసులు కూడా పెట్టారు. ఓ అయోధ్య సాధువు అయితే ఉదయ్‌ నిధి తల మీద ఏకంగా 10 కోట్ల పైనే పెట్టారు.

అయితే వీటిని అన్నింటిని కూడా ఉదయ్‌ చాలా తేలికగా తీసుకున్నారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేదే లేదని తేల్చి చెప్పారు. దానికి తగినట్లుగానే ఆయన వెటకారంగా స్పందించడం కూడా మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫోటోలు పోస్ట్‌ చేస్తూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ (Gajendra Shekavath) సనాతన ధర్మం వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించారు. రాజస్థాన్‌ (Rajasthan) లో ఓ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉదయ్‌ నిధిని హెచ్చరించారు. '' మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి వారు దేశంలో ఉండటానికి ఇక ఎంత మాత్రం అర్హులు కాదు. అలాంటి వారిని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారు రాజకీయంగా ఎదగలేరని షెకావత్ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారిపై స్పందిస్తూ.. సనాతన ధర్మాన్ని నాశనం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, డెంగ్యూ, కుష్టువ్యాధులతో పోల్చేవారిని, వాటిని ఆనందించమని నేను శాపనార్థాలు పెడుతున్నానని సాధ్వి అన్నారు.

సాధ్వి ప్రగ్యా బాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌ ని కూడా టార్గెట్ చేశారు. నటుడిని విలన్‌గా అభివర్ణిస్తూ.. తనకు మతం, దేశం గురించి మాట్లాడే అలవాటు ఉందన్నారు. తాను చెప్పేది అర్థం చేసుకోని వాడు విలన్ కావచ్చు, హీరో కాలేడని మండిపడ్డారు. రెండవ విషయం ఏమిటంటే సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. జీతాల పెంపునకు వ్యతిరేకంగా సమ్మెలో కూర్చున్న కార్మికుల సమ్మెను ముగించేందుకు బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా భోపాల్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, డెంగ్యూ, మలేరియాలతో పోల్చే వారు మాత్రమే ఆనందించాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. ఇంతమంది మతస్థులు కాదని సాధ్వి అన్నారు. మతోన్మాదులు ఏదైనా చేయగలరన్నారు.

#sanathanadharma-row #gajendra-shekavath #udayanidhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe