జమ్మూలో స్వల్ప భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.2 గా నమోదు!

జమ్మూలోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం 12.25 గంటలకు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.2గా నమోదైంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని సమాచారం.

New Update
జమ్మూలో స్వల్ప భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.2 గా నమోదు!

జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో మధ్యాహ్నం  భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.2 గా  నమోదైంది. పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం..బారాముల్లా  జిల్లాలో 5 కిలో మీటర్ల లోతులో కు మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూ ప్రకంపనలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.

Advertisment
తాజా కథనాలు