TS News : కాంగ్రెస్ లో ఆ తెలంగాణ పార్టీ విలీనం..!

కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనం అయ్యింది. మార్చి 22న గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షులు రమేశ్ తోపాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

TS News : లోకసభ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనం అయ్యింది. మార్చి 22న గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షులు రమేశ్ తోపాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.

ఈ సందర్బంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నారు. లేబర్ పార్టీని మనస్పూర్తిగా పార్టలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అనేక సంక్షేమ అభివ్రుద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇంచార్జీ దీపాదాస్ మున్షి సూచన మేరకు విలీనం చేసుకున్నామని తెలిపారు. పార్టీలో రమేశ్ కు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు దోస్తులంతా దొంగలే.. డ్రగ్స్ వ్యవహారంపై పేర్ని నాని సంచలన ఆరోపణలు!

Advertisment
తాజా కథనాలు