YCP: ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే!

రేపటి నుండే మేమంతా సిద్ధం పర్యటనలు ప్రారంభంకానున్నాయి. సీఎం జగన్ ఉదయం తాడేపల్లి నివాసం నుండి బయలుదేరుతారు. మ. 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పిస్తారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
YCP:  ' మేమంతా సిద్ధం ' బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే!

CM Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు.

Also Read:  వైసీపీ ప్రచార సామాగ్రి సీజ్.. దాదాపు 2 కోట్ల డబ్బు.. ఆందోళన చేపట్టిన టీడీపీ

అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Advertisment
తాజా కథనాలు