Mekapati Keerthi : మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి డ్రీమ్.. ఆత్మకూరు అభివృద్ధి చేయడమన్నారు ఆయన సతీమణి మేకపాటి శ్రీ కీర్తి రెడ్డి. నెల్లూరులో మేకపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉండాలని.. పరిశ్రమలు తీసుకురావాలని మేకపాటి గౌతమ్ రెడ్డి తపనపడ్డారన్నారు. గౌతం చివరి శ్వాస వరకు ఆత్మకూరు అభివృద్ధి కావాలని కలలు కన్నారన్నారు. విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు.
Also Read: Lokam Madavi: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..!
మేకపాటి కుటుంబం డబ్బు కోసం రాజకీయల్లోకి రాలేదని.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. గౌతం చాలా సున్నితమైన మనసత్వం కలిగిన వ్యక్తి అని.. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తాడని పేర్కొన్నారు. గౌతం వ్యాపారాలు చేసే సమయంలో ఎప్పుడూ పిల్లలతో ఉండే వాడు కాదని..చివరి రోజుల్లో గౌతం పిల్లలతో గడిపే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.