ఫ్రాన్స్ నిత్యం నిరసనలతో అట్టుడికే దేశం. తలవంచడమే కానీ.. తలదించడం తెలియని పౌరులు అక్కడుంటారు. అందుకే అధ్యక్ష పీఠంపై ఎవరెక్కినా ప్రజలు లెక్క చేయరు. తప్పుంటే ప్రశ్నిస్తారు. నిలదీస్తారు. తాడోపెడో తేల్చుకుంటారు. మరోసారి అదే చేస్తున్నారు. జూన్ 27న జరిగిన 17 ఏళ్ల టీనేజర్ మరణం ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఆఫ్రికాలోని అల్జీరియా నుంచి వలస వచ్చిన కుటుంబం నహెల్ది. ఇది జాత్యహంకార కాల్పులుగా ప్రజలు భగ్గమంటున్నారు. పారిస్, మార్సెయిల్, లియాన్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేలాది మంది యువకులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. పారిస్ మేయర్ విన్సెంట్ జీన్బ్రన్ ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. కారుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మేయర్ భార్య, వాళ్ల పిల్లాడికి గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..France: ఫ్రాన్స్లో ఆగని అల్లర్లు.. ఏకంగా పారిస్ మేయర్ కారుకే నిప్పు
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్లో గత జూన్ 27 రాత్రి మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి.వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 పైగా వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. పారిస్ మేయర్ కారుకు నిప్పుపెట్టారు.
Translate this News: