Mayawati: దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేప‌ట్టాలి: మాయావ‌తి డిమాండ్

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవలే పలు రాష్ట్రాలు అందుకు అంగీకరించడం, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

New Update
Mayawati: దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేప‌ట్టాలి: మాయావ‌తి డిమాండ్

Mayawati: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. కులగణన నిర్వహించాలని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు భారీగా వస్తున్నాయని మాయావతి వెల్లడించారు. ఆ డిమాండ్లతో బీజేపీ నిద్రలేని రాత్రులు గడుపుతోందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. అది నిజమేనా?!

దేశవ్యాప్తంగా సరైన ప్రక్రియను అనుసరించి కులగణన చేపట్టడం ద్వారా ప్రజలందరికీ రావాల్సిన హక్కులను సమానంగా లభించేలా చూడాలని మాయావతి అన్నారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 4న ప్రారంభమై 22వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు కులగణనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందో లేదో వేచిచూడాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు