AP: ఘోర ప్రమాదం.. రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి..!

అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. రాంబిల్లి సెజ్‌లోని వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్‌రౌత్‌గా గుర్తించారు. ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.

AP: ఘోర ప్రమాదం.. రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి..!
New Update

Vishaka: అనకాపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు సంభవించింది. రాంబిల్లి సెజ్‌లోని వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  రియాక్టర్‌ పేలడంతో అలర్ట్ అయిన కార్మికులు బయటకు పరుగులు తీశారు.

Also Read: మిస్టరీగా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు..!

గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్‌రౌత్‌గా గుర్తించారు. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అనిత క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

#anakapalli-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe