Cars : దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(Maruti Suzuki India) సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ ఆటోమొబైల్ తయారీదారు మారుతీ బుధవారం తన Franxx మోడల్ దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో రికార్డు సమయంలో 1 లక్ష యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 10 నెలల్లోనే ఈ మోడల్కు చెందిన 1 లక్ష యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఇది ఒక రికార్డు.
పూర్తిగా చదవండి..Cars : అమ్మకాల్లో గ్రాంట్ విటారాను వెనక్కి నెట్టేసిన ఫ్రాంక్స్ …కేవలం పది నెలల్లోనే..!!
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన పది నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును మారుతి సుజుకి ఫ్రాంక్స్ బ్రేక్ చేసింది.
Translate this News: