నోరు జారరు.. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతారు..ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు.. ఒక్క అక్షరం పొల్లు పోకుండా..వివాదాలకు దూరంగా పార్టీ హైకమాండ్ ఇచ్చిన పనిని సైలెంట్గా చేసుకుపోయే అరుదైన నాయకుల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు (sridhar babu) ఒకరు. ఏఐసీసీ కార్యదర్శిగా ఓవైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుంటూ నియోజకవర్గంలోనూ తనదైన మార్క్ చూపించే ఆయన.. ఆర్టీవీ(RTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ గెలిస్తే సీఎం కిరీటం ఎవరికి? ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమంటున్నారు?
ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అవ్వలన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని.. ఇది వ్యక్తిలకు సంబంధించిన పార్టీ కాదన్నారు శ్రీధర్బాబు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని చెప్పారు. ప్రజలకు కూడా ఈ విషయం ఎప్పుడో అర్థమైపోయిందంటూ కేసీఆర్కు చురకలంటించారు.
Translate this News: